తెలంగాణలో జనగణన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను తెలంగాణ గెజిట్లో పునఃప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఈనెల 29న తెలంగాణ గెజిట్లో జనగణన నోటిఫికేషన్ ప్రచురించనున్నారు. దీంతో రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రక్రియకు అధికారికంగా మరో ముందడుగు పడనుంది. వచ్చే నెలలో ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించనున్నారు.