నేపాల్లో భారీ వరదలు, ఆకస్మిక జలప్రళయంతో వందలాది మంది గల్లంతైన నేపథ్యంలో మానససరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ సమయంలో డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాము వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకోలేదని.. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు.. ఏపీకి చెందిన కొందరు యాత్రికుల ఆచూకీ కోసం రాష్ట్ర అధికారులు నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నారు. తిరుపతికి చెందిన 28 మంది యాత్రికులు కాఠ్మాండూలో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు.