తెలంగాణలో 2027 జనాభా లెక్కల సేకరణ మొదటి దశను మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించాలని సీఎస్ కె రామకృష్ణారావు ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియ పూర్తి డిజిటల్ విధానంలో.. మొబైల్ యాప్ ద్వారా జరగనుంది. పౌరులు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్-ఎన్యూమరేషన్ సౌకర్యం కూడా కల్పించారు.