టైఫాయిడ్ మరణాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దేశంలో టైఫాయిడ్తో ప్రాణాలు విడిచే ప్రతీ ఐదుగురిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు అని ఆ నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలో మొత్తం 1,075 మంది టైఫాయిడ్ కారణంగా చనిపోగా.. అందులో 202 మరణాలు ఒక్క తెలంగాణలోనే నమోదయ్యాయని పేర్కొంది.