తెలంగాణలో 2027 జనగణన ప్రక్రియలో భాగంగా నేటి (ఏప్రిల్ 26) నుంచి మే 10 వరకు 'సెల్ఫ్-ఎన్యుమరేషన్' కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన మాత్రమే కాకుండా.. డిజిటల్ పద్ధతిలో, కులగణనతో కూడిన చారిత్రాత్మక ప్రక్రియ అని జనగణన డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు. మే 11 నుంచి ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటినీ సందర్శించి భవనాల గుర్తింపు ప్రక్రియను చేపడతారని తెలిపారు.