తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు, నిపుణుల కోసం ప్రత్యేకంగా ఒక ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ఏప్యాప్సిస్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీని ద్వారా సాంకేతిక రంగంలో నూతన శకం ప్రారంభం కానుందని చెప్పారు.