తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే పది రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే తీవ్ర చలి మొదలవగా.. హైదరాబాద్లోనూ చలి ప్రభావం పెరుగుతోంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెలువడ్డాయి.