తెలంగాణలో పాకిస్థాన్ పౌరులు అక్రమంగా ఓటు హక్కు వినియోగిస్తున్నారని బీజేపీ నాయకురాలు మాధవీ లత ఆరోపించారు. దీనికి కొన్ని రాజకీయ పార్టీల అండ కూడా ఉందని.. వారి వల్లే దేశ జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా ఏర్పడుతోందని ఆమె అన్నారు. 2018 నుంచి నకిలీ ఆధార్, ఓటర్ ఐడీలతో ఓట్లు నమోదు చేస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం పార్టీలు సహకరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.