తెలంగాణలో కొత్త జిల్లాల పునర్విభజనపై వస్తున్న వార్తలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో కుంభకోణం జరుగుతోందన్న బీఆర్ఎస్ ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.