తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. వ్యవసాయ భూముల విలువ గరిష్టంగా 300 శాతం పెరగనుండగా.. ఓఆర్ఆర్ పరిసరాల్లోని ప్లాట్ల రేట్లు మూడింతలు కానున్నట్లు తెలిసింది. అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలను స్వల్పంగా పెంచి.. కమర్షియల్ స్పేస్ రేట్లను మాత్రం తగ్గించాలని ప్రతిపాదించారు. రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం అనంతరం ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా రియల్ రంగంలో పారదర్శకత రానుంది.