తెలంగాణలో భూమలు ఉన్న వారికి గుడ్న్యూస్. రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భూముల మార్కెట్ విలువ సవరణపై అధ్యయనం చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల సవరణ ప్రతిపాదనలు సిద్ధం కాగా.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను సవరించాలని నిర్ణయం తీసుకుంది.