తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వైద్య బిల్లుల బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 180 కోట్ల రూపాయలను విడుదల చేయడంతో వేలాది మంది ఉద్యోగులకు ఊరట లభించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మరిన్ని వివరాలు కోసం ఈ వార్త చదవండి.