తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీతో కమలం పార్టీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో రెండుసార్లు బీఆర్ఎస్కు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని.. తర్వాత బీజేపీదే అధికారం అని తేల్చి చెప్పారు. ఇక ఇరాన్ యుద్ధం విషయంలో కాంగ్రెస్ పార్టీ.. దేశ ప్రజల్లో లేని పోని భయాలను రేపుతోందని ఆరోపించారు.