తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. 43 డిగ్రీలు దాటిన ఎండలు, హెచ్చరికలు జారీ

1 week ago 1
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఏప్రిల్ నెల సగం కూడా గడవకముందే భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. సాధారణంగా మే నెలలో ఉండే ఎండలు ఇప్పుడు ఏప్రిల్‌లోనే కనిపిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంగళవారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే ఐదు రోజుల్లో ఎండలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ప్రజలకు జాగ్రత్తలు సూచించారు.
Read Entire Article