తెలంగాణలో మాదకద్రవ్యాల కేసులు గత మూడేళ్లలో 47 శాతం పెరిగి పోలీసులకు ప్రధాన సవాలుగా మారాయి. 2023-24లో 2,026గా ఉన్న కేసులు 2025-26లో 2,960కి చేరాయి. సైబరాబాద్లో 90 శాతం, వరంగల్లో 142 శాతం పెరుగుదల నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లోనూ కేసులు పెరిగాయి. మరోవైపు మొత్తం నేరాలు 7 శాతం పెరిగినా హత్య, దోపిడీ, చోరీ వంటి తీవ్రమైన నేరాలు 10.3 శాతం తగ్గాయి. మహిళలపై నేరాలు మూడు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి.