తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. గుడిసె ఉన్న ప్రతి కుటుంబానికీ ఇల్లు అందించి గుడిసెలు లేని తెలంగాణగా తీర్చిదిద్దుతామని అన్నారు. నూతనకల్లో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... భూమిపై హక్కు రైతుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పారు. తుంగతుర్తికి రూ.100 కోట్ల రోడ్లు మంజూరయ్యాయని, మరో రూ.200 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు.