తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి 15 నాటికి రూ.11,957.30 కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక్క డిసెంబర్ నెలలోనే రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.1,391.30 కోట్ల ఆదాయం వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు.