తెలంగాణలో సర్వే వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం చేపట్టింది. మొదటి విడతలో 3,465 మందికి శిక్షణ పూర్తయి, సీఎం చేతుల మీదుగా లైసెన్సులు అందనున్నాయి. భూ వివాదాలు తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.