తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ఇష్టానుసారం పెంచారనే అభిప్రాయంతో.. కొన్ని చోట్ల తగ్గించి, మరికొన్ని చోట్ల పెంచే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. లావాదేవీలు అధికంగా జరిగే ప్రాంతాలు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలపై దృష్టి సారించనున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా తాజా ప్రతిపాదనలు సమర్పించాలని ఇప్పటికే సర్కార్ అధికారులను ఆదేశించింది.