తెలంగాణలో భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో భూముల విలువలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బహిరంగ మార్కెట్లో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి ఆదాయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.