తెలంగాణ రాష్ట్రంలో భూవివాదాలు తగ్గించి.. పారదర్శకత పెంచేందుకు 'భూభారతి' విధానంలో కఠిన నిబంధనలు పెట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ధరణిలోని సీక్రెట్ లాకర్లను తెరిచి.. 9 లక్షల ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా ఉండేలా భూభారతిని రూపొందించారు. భూధార్ కార్డులు సిద్ధంగా ఉన్నాయని.. సర్పంచ్ ఎన్నికల తర్వాత గ్రామాల్లో పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. 111 జీవో పరిధిలో కూడా చట్టబద్ధంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.