తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్న్యూస్. మద్యం ధరలు పెరగనున్నాయి. క్వార్టర్పై రూ. 10, హాఫ్పై రూ. 20, ఫుల్పై రూ. 40 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు పంపినట్లు సమాచారం. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు ఇతర మద్యం ధరలు పెంచేందుకు డిసైడ్ అయింది. అయితే ఈ పెంపుపై ఎక్సైజ్ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ధరలు పెరిగినా అమ్మకాలు తగ్గకపోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.