తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) విస్తరణకు శ్రీకారం చుట్టింది. కొత్త మండలాల్లో 131 సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ సిఫార్సు చేసింది. దీంతో రైతులకు రుణ సదుపాయం, విత్తనాలు, ఎరువుల పంపిణీ మరింత చేరువ కానుంది.