నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణ శివారులో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. రూ. 44 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ నిర్మాణం నాణ్యతతో.. వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పక్కన మక్తల్ ఉండడంతో తరచూ జరిగే ప్రమాదాలకు మెరుగైన వైద్యం అవసరం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టు మొదలైంది. భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేసి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు.