రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించి.. వారికి సహాయం అందించి.. పేదరికం నుంచి బయటికి తీసుకొస్తామని మంత్రి సీతక్క తెలిపారు. నిరుపేదలకు కేరళలో అమలు చేస్తున్న పథకం స్ఫూర్తితో రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.