Telangana Bala Bharosa Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం ఇప్పటికే పలు రకాల పథకాలు అమలు చేస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని 5 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది. బాల భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.