తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన ఇన్నోవా కారు.. స్పాట్‌లో 8 మంది..

7 months ago 15
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై అడ్డంగా పల్టీ కొట్టింది. ప్రమాదంతో కారు నుండి పెట్రోల్ లీకై మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు. కారు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి, రాకపోకలను సజావుగా కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Read Entire Article