మంచిర్యాలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రానుంది. రైలు నడిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్ - నాగపూర్ వందే భారత్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. మంత్రి ప్రకటనతో మంచిర్యాల ప్రజల్లో ఆశలు పెరిగాయి.