తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. పర్యాటక రంగానికి భద్రత కల్పించేందుకు టూరిస్ట్ పోలీసు వ్యవస్థను అమల్లోకి తేనుంది. సెప్టెంబర్ 27 నుంచి రాష్ట్రంలో టూరిస్ట్ పోలీసు వ్యవస్థను ప్రారంభించనున్నారు. తొలి దశలో 80 మంది సిబ్బందిని కేటాయించనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీరు విధులు నిర్వర్తించనున్నారు. ఈమేరకు డీజీపీ జితేందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..