తెలంగాణలో మరో హైవే విస్తరణ.. 4 వరుసలుగా, త్వరలోనే..!

10 months ago 17
కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి విస్తరణపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నితిన్ గడ్కరీతో చర్చించారు. రూ. 2,151.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలుగు వరుసల పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. సంజయ్ రిక్వెస్ట్‌కు గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందే. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. కాగా, ఈ రహదారి నిర్మాణంతో రైతుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రమాదాలు తగ్గటంతో పాటు పర్యాటకం, భూముల ధరలు పెరుగుతాయి.
Read Entire Article