తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 18 తర్వాత రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక అదే సమయంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. పలు జిల్లాల్లో 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మేర ఎండలు ఉంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.