తెలంగాణలో చలిపులి మళ్లీ పంజా విసురుతోంది. గతకొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించగా.. నిన్న, నేడు టెంపరేచర్లు తగ్గాయి. శనివారం కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు హైదరాబాద్ శివారులో 15 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.