తెలంగాణలో నెలకొన్న భూ సమస్యలకు పరిష్కారం చూపాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వాస్తవ భూమికి, రికార్డులకు మధ్య తేడాలు ఉండటంతో కొన్ని చోట్ల సమస్యలు వస్తుండగా.. వాటికి చెక్ పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో మళ్లీ భూ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయింది. త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తుంది.