తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లొద్దని అంటున్నారు.