గురుకుల పాఠశాలల్లో కోడిగుడ్ల ధరల పెంపులో తెలంగాణ ప్రభుత్వం రూ.600 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ నేత ప్రవీణ్కుమార్ ఆరోపించారు. జీవో నెం.17ను రద్దు చేయాలని, లేకపోతే కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలకే కాంట్రాక్టులు కట్టబెట్టి చిన్న కాంట్రాక్టుల పొట్ట పొడుతున్నారని విమర్శించారు.