ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు వెళ్తున్నారు. ప్రమాదం అని తెలిసినా.. చాలా మంది చేపల వేటకు వెళ్తున్నారు. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. చేపల వేటకు వెళ్లే వారి రేషన్ కట్ చేస్తామని స్థానిక తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.