నీటి సౌకర్యం ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ తెలిపారు. ఆయిల్ పామ్ గెలలను మధ్యవర్తిత్వం లేకుండా కంపెనీ ప్రతినిధులే నేరుగా కొనుగోలు చేస్తారని చెప్పారు. ఎకరాకు 57 మొక్కలను ప్రభుత్వం రూ. 20కే రాయితీపై అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా.. బిందు సేద్యం (Drip Irrigation) పరికరాలపై ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం.. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు భారీ రాయితీ లభిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.