తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచుతారని వస్తున్న వార్తలను ఈఆర్సీ ఖండించింది. వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి విద్యుత్ టారిఫ్ల పెంపు ఉండబోదని తేల్చి చెప్పింది. అదే సమయంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని తెలిపింది. ఇక ఉచిత విద్యుత్ పథకం ద్వారా.. కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందని.. ఈ క్రమంలోనే విద్యుత్ చౌర్యం కేసులు భారీగా తగ్గినట్లు వెల్లడించింది.