తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ల పెంపు అంశం విస్మరించబడిందని విమర్శలు వస్తున్నాయి. ఆరు గ్యారెంటీల్లో భాగంగా పెన్షన్ పథకం కొనసాగుతున్నప్పటికీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన పెంపు హామీ ఇప్పటికీ నెరవేరలేదు. బడ్జెట్ లోపం కారణమని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ.. ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ పెంపు తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.