Ap People Suffered With Telangana Election Code: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం కావడంతో రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు సరైన పత్రాలు చూపడం తప్పనిసరి. లేదంటే డబ్బు స్వాధీనం చేసుకుంటున్నారు. వైద్యం, వ్యాపారం, ఫీజుల వంటి అవసరాలకు వెళ్లేవారు ఆధారాలు ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏలూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.