తెలంగాణలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తాను బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. సారా తాగిన వారు ఎక్కువ కాలం బతికేవారని.. కానీ ఇప్పుడు మద్యం తాగే వారు తొందరగా చనిపోతున్నారని తెలిపారు.