తెలంగాణ నీటిపారుదల శాఖలో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇంజినీర్లకు పూర్తిస్థాయి పదోన్నతులు లభించాయి. మొత్తం 263 మంది ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా ప్రమోషన్లు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఉత్తమ్.. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రమోషన్లు లభించటం పట్ల ఇంజినీర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.