రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం అనే కేంద్ర ప్రభుత్వ పథకంతో టీ ఫైబర్ ప్రాజెక్టును అనుసంధానం చేయడంపై కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.