రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా యూకేజీని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గతేడాది కొన్ని స్కూళ్లలో యూకేజీని తీసుకురాగా.. ఈ ఏడాది మరిన్ని స్కూళ్లలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 6 వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనున్నారు. మరోవైపు.. ఎల్కేజీ, నర్సరీలను కూడా ప్రవేశపెట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.