తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. పగటి వేళలో భారీ ఎండలు, ఉక్కపోత.. రాత్రివేళ చలి. గతంలో ఇటువంటి పరిస్థితి ఉన్న దాఖలాలు లేవని జనం అంటున్నారు. ఇక, వేసవి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ద్రోణి, ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వానలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.