డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్న తరుణంలో టీజీఎస్ఆర్టీసీ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రైవేటు సంస్థలు అత్యాధునిక ఈవీ బస్సులతో.. తక్కువ ఛార్జీలతో.. మెరుగైన సౌకర్యాలతో మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ పోటీని ఎదుర్కోవడానికి ఆర్టీసీ కూడా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతూ సేవల నాణ్యతను మెరుగుపరుస్తోంది.