తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. అయితే ఈ లేఖపై స్పందించిన డీజీపీ.. చట్టసభల్లో మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని తేల్చి చెప్పారు. తేజస్వీ సూర్య మాట్లాడుతుంటే అడ్డు చెప్పలేదని.. తెలంగాణ బీజేపీ ఎంపీలపైనా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.