తెలంగాణలో అధిక తేమతో పత్తిని కొనుగోలు చేయడంలో సీసీఐ నిబంధనలు సడలించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 20 శాతం మించిన కొనుగోలు చేయాలన్నారు. ఆదిలాబాద్లో మద్దతు ధర దక్కక రైతులు ఆందోళన చేపట్టారు. చివరికి, తేమతో సంబంధం లేకుండా క్వింటాలుకు రూ.6,590 చెల్లించేలా తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారు.