పెద్దపల్లికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి లెంకల వివేకానంద రెడ్డి అద్భుతమైన సామాజిక స్పృహను ప్రదర్శించాడు. యూరప్లోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించి యాంటి డ్రగ్స్ కాంపెయిన్ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటాడు. తండ్రి మహిపాల్ రెడ్డితో కలిసి 5,642 మీటర్ల శిఖరాన్ని జయించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. అతని సాహసం.. మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం పట్ల నిబద్ధత యువతకు ఆదర్శనీయం అని చెప్పుకోవచ్చు.