తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. 15 ఏళ్ల ఆంక్షల తర్వాత.. ఎన్నికల సంఘం స్పష్టతతో సింగరేణి ఉద్యోగులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.